సత్తెనపల్లి టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గపోరు

6 Dec, 2022 15:57 IST|Sakshi

సాక్షి, పల్నాడు జిల్లా: సత్తెనపల్లి టీడీపీలో వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. నగరంలోని ఎన్టీఆర్‌ భవన్‌లో వైవీ ఆంజనేయుల వ్యతిరేకవర్గం అత్యవసరంగా సమావేశమైంది.

ఈ సమావేశానికి ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. స్థానికులకే సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. తమ అభిప్రాయాలను అధిష్టానం పరిగణలోకి తీసుకోవాలని వైవీ ఆంజనేయులు వ్యతిరేకవర్గం డిమాండ్‌ చేస్తోంది. 

చదవండి: (మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో చుక్కెదురు)

మరిన్ని వార్తలు