రాహుల్ భారత్‌ జోడో యాత్రలో కమల్ హాసన్..

19 Dec, 2022 07:44 IST|Sakshi

చెన్నై: రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రలో ఈ నెల 24న తాను పాల్గొనబోతున్నట్లు ప్రముఖ సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ చెప్పారు. యాత్రలో పాల్గొనాలంటూ రాహుల్‌ తనను ఆహ్వానించారని చెప్పారు.

ఆదివారం పార్టీ ఆఫీస్‌ బేరర్ల సమావేశంలో కమల్‌ మాట్లాడారు. భారత్‌ జోడో యాత్రలో కమల్‌తోపాటు కార్యకర్తలు కూడా పాల్గొంటారని మక్కల్‌ నీది మయ్యం అధికార ప్రతినిధి మురళి అప్పాస్‌ వెల్లడించారు.
చదవండి: రూ.13 కోట్ల వంతెన.. ప్రారంభానికి ముందే ఫసక్..

మరిన్ని వార్తలు