కేసీఆర్ దళితుడిని సీఎం చేయలేదు: ఈటల

23 Jul, 2021 13:13 IST|Sakshi

సాక్షి, కరీంనగర్: కేసీఆర్ దళితుడిని సీఎం చేయలేదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ధ్వజమెత్తారు. గతంలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ప్రకటించిన కేసీఆర్‌ ఆ మాటను నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. ఇప్పుడు కూడా ఓట్ల కోసమే దళిత బంధు ఇస్తామంటున్నారని విమర్శించారు. తాజా పరిణామాలు చూస్తుంటే హుజురాబాద్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఉప ఎన్నిక తేది ఎప్పుడని స్పష్టంగా తెలియకపోయినా ఇప్పటినుంచే రాజకీయ పార్టీల నేతలు హల్‌చల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మాటల యుద్ధాలు అప్పుడే మొదలయ్యాయి. 

మరిన్ని వార్తలు