తెలుగు రాష్ట్రాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాదయాత్ర

19 Aug, 2021 09:57 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: తెలుగు రాష్ట్రాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాదయాత్ర కొనసాగుతోంది. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం స్విమ్స్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. కాసేపట్లో విజయవాడ బయల్దేరనున్నారు. నేటి మధ్యాహ్నం కనక దుర్గమ్మను కిషన్‌రెడ్డి దర్శించుకోనున్నారు. తెలంగాణలోని నల్లబండగూడెం నుంచి జన ఆశీర్వాదయాత్ర ప్రారంభంకానుంది. సాయంత్రం కోదాడ బహిరంగ సభలో కిషన్‌రెడ్డి  పాల్గొంటారు.

మరిన్ని వార్తలు