చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. 

16 Feb, 2023 18:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు.. మాజీ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. చంద్రబాబు కంటే నిష్ట దరిద్రుడు ఎవరూ లేరంటూ సంచలన కామెంట్స్‌ చేశారు. అలాగే, వివేకా హత్య కేసులో చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావును సీబీఐ విచారించాలని డిమాండ్‌ చేశారు.

కాగా, కొడాలి నాని సాక్షితో మాట్లాడుతూ.. చంద్రబాబు మగాడైతే 2014 నుంచి పోలవరంపై సీబీఐ విచారణకు లేఖ రాయాలి. పోలవరంలో చంద్రబాబు అవినీతి చేశారని ప్రధాని నరేంద్ర మోదీనే చెప్పారు. చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావు సారథ్యంలోనే వివేకా హత్య జరిగింది. చంద్రబాబు కంటే నిష్ట దరిద్రుడు ఎవరూ లేరు. చంద్రబాబుకి ఉన్న జబ్బుకి ఆయన పాలనంతా అరిష్టమే. బాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్‌ అయినా నిండిందా?. కరువు, చంద్రబాబు కవల పిల్లలు. మం​త్రి రోజాపై నారా లోకేష్‌ దిగజారి మాట్లాడుతున్నాడు. వ్యాపారాలు చేస్తున్న లోకేష్‌ భార్య, తల్లిని అలానే పిలవాలా?. 

మైండ్‌ చెదిరిపోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు గ్రాఫిక్స్‌ డిజైనర్‌ కాబట్టే ప్రజల్లో ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. చంద్రబాబుకు ప్రకృతి కూడా సహకరించదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

మరిన్ని వార్తలు