Munugode: మునుగోడులో సర్పంచ్‌లకు ఫోన్లు చేస్తున్నారు: రాజగోపాల్‌రెడ్డి ఫైర్‌

12 Aug, 2022 14:40 IST|Sakshi

 Munugode Politics.. మునుగోడు పాలిటిక్స్‌ ఒక్కసారిగా వేడాక్కాయి. నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ప్రస్తుత రాజకీయాలపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పందించారు. 

రాజగోపాల్‌రెడ్డి శుక్రవారం మునుగోడులో మీడియాతో మాట్లాడుతూ.. నా రాజీనామా తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. నా రాజీనామా తర్వాతే చేనేత కార్మికులకు పెన్షన్‌ ప్రకటించారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడే నియోజకవర్గంలో అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారు. 

అందరు సర్పంచ్‌లకు ఫోన్లు చేస్తున్నారు. నా రాజీనామాతోనే ఫండ్స్‌ రిలీజ్‌ చేశారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ప్రభుత్వం నిధులను అడ్డుకుంటోంది. ప్రభుత్వం వివక్షతో ప్రవర్తిస్తోంది. మొన్నటి వరకు మునుగోడుపై మాట్లాడితే సీఎం కేసీఆర్ స్పందించలేదు. కానీ, నా రాజీనామా తర్వాత సీఎం కేసీఆర్‌ మునుగోడుకు వస్తున్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిధులు కేటాయించలేదు. కానీ.. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు మాత్రం వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నారంటూ మండిపడ్డారు. 

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. 

మరిన్ని వార్తలు