నమ్మి గెలిపించిన ప్రజల ప్రాణాలకు భరోసా ఇవ్వండి: కోమటిరెడ్డి ఫైర్‌

31 Aug, 2022 20:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇబ్రహీంపట్నం కు.ని ఆపరేషన్ల ఘటన సంచలనంగా మారింది. ఈ ఆపరేషన్లలో వైద్యుల నిర్లక్ష్యంగా నలుగురు మహిళలు మృతిచెందారు. దీంతో, ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష నేతలు, ప్రజలు మండిపడుతున్నారు. 

కాగా, మహిళల మృతిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ సర్కార్‌, సీఎంపై ఫైరయ్యారు. కేసీఆర్‌ బీహార్‌ పర్యటనను ప్రస్తావిస్తూ కోమటిరెడ్డి ఓ లేఖ రాశారు. ఈ లేఖలో పేదల ప్రాణాల కంటే మీకు రాజకీయాలే ముఖ్యమా సీఎం కేసీఆర్‌ను కోమ‌టిరెడ్డి ప్ర‌శ్నించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌పై ఫైర్‌ అయ్యారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై నలుగురు మహిళలు మరణిస్తే మీకు వారిని పరామర్శించే తీరిక లేదు. కానీ విమానంలో పట్నాకు వెళ్లి రాజకీయాలు మాట్లాడే టైం ఉందా? అంటూ కోమ‌టిరెడ్డి స‌ద‌రు లేఖలో కేసీఆర్‌ను ప్ర‌శ్నించారు.

మరిన్ని వార్తలు