సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఒక్క ఎన్నిక ఫలితం పార్టీని ప్రభావితం చేయలేదు అన్నారు. గత 20 ఏళ్లలో టీఆర్ఎస్ అనేక ఎత్తుపల్లాలను చూసిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డ హరీశ్రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
In the last 20 years TRS has seen many highs and lows & this one election result will not be of much significance or consequence
My compliments to @GelluSrinuTRS on a spirited fight 👍
Appeal to all TRS workers to work with increased resolve to forge ahead in future battles
— KTR (@KTRTRS) November 2, 2021
ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. 24 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఈటల గెలుపొందారు. ఈటల సెంటిమెంట్ ముందు కారు ఎత్తుగడలు ఏవి పనిచేయలేదు. దళిత బంధు టీఆర్ఎస్ను ఏమాత్రం ఆదుకోలేకపోయింది.
చదవండి: కాంగ్రెస్లో హుజూరాబాద్ చిచ్చు: ‘బల్మూర్ వెంకట్ని బలి పశువు చేశారు’