‘అక్రమ మద్యం వెనుక చంద్రబాబు హస్తం ఉందనే అనుమానం’

8 Sep, 2021 16:56 IST|Sakshi

ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణ స్వామి వెల్లడి

సాక్షి, అమరావతి: ప్రజల ఆరోగ్యం దృష్ట్యా దశల వారీగా మద్యపాన నిషేధం విధిస్తున్నట్లు ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణ స్వామి తెలిపారు.  కాగా, బెల్ట్‌షాపులు పెట్టి మద్యం విక్రయాలను ప్రోత్సహించింది ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడేనని విమర్శించారు. అసలు మద్య నియంత్రణ అనేది చంద్రబాబుకు ఇష్టం లేదని తెలిపారు. అక్రమ మద్యం సరఫరా వెనుక చంద్రబాబు ఉన్నారనే అనుమానం ఉందని నారాయణ స్వామి ఆరోపించారు.

మరిన్ని వార్తలు