గుజరాత్‌లో అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి.. వాటర్‌ బాటిల్‌ విసిరిన వ్యక్తి

3 Oct, 2022 07:31 IST|Sakshi

రాజ్‌కోట్‌: ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై గుర్తుతెలియని వ్యక్తి ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌ విసిరాడు. అది ఆయనకు తగలకుండా, తలపై నుంచి వెళ్లి ముందుపడింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.

నగరంలో దేవీ నవరాత్రుల్లో భాగంగా గర్బా వేడుకలో కేజ్రీవాల్‌ పాల్గొన్నారు. నడుస్తూ అభివాదం చేస్తుండగా, ఇంతలో వెనుక నుంచి ప్లాస్టిక్‌ నీళ్ల సీసా దూసుకొచ్చింది. అది కేజ్రీవాల్‌ తల పైభాగం నుంచి ముందుకు వెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆప్‌ మీడియా కో–ఆర్డినేటర్‌  తెలిపారు.

చదవండి: రాహుల్ భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ

మరిన్ని వార్తలు