బీజేపీ అసత్య ప్రచారం.. మండిపడ్డ మంత్రి అంబటి

19 Jun, 2022 14:11 IST|Sakshi

సాక్షి, నెల్లూరు జిల్లా: రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు సరికావని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. నెల్లూరులో క్రాప్‌ హాలిడే అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయ స్పష్టత లేని పార్టీ జనసేన అని దుయ్యబట్టారు. సీఎం జగన్‌ చేతుల మీదగా సంగం, నెల్లూరు బ్యారేజీలను ప్రారంభిస్తామని తెలిపారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డిని భారీ మెజారిటీ గెలిపించాలని మంత్రి కోరారు.
చదవండి: అయ్యన్న బాగోతం.. మంత్రి అమర్‌నాథ్‌ ఏమన్నారంటే?

మరిన్ని వార్తలు