చంద్రబాబు విజనరీ కాదు.. విజన్‌ లేని వ్యక్తి: మంత్రి వేణు

18 Feb, 2023 11:35 IST|Sakshi

సాక్షి, రామచంద్రాపురం(కోనసీమ జిల్లా): చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకుడు సైకోలా వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు విజనరీ కాదు.. విజన్‌ లేని వ్యక్తి అంటూ దుయ్యబట్టారు.

‘‘చట్టాలను ఎవరైనా గౌరవించాల్సిందే. పోలీసుల పట్ల చంద్రబాబు దౌర్జన్యంగా వ్యవహరించారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదు’’ అని మంత్రి వేణు అన్నారు.
చదవండి: Fact Check: రామోజీ దిగులు ‘ఈనాడు’ రాతల్లో కనపడుతోంది..

మరిన్ని వార్తలు