పవన్‌ కల్యాణ్‌కు అంత ధైర్యముందా?..

21 Aug, 2022 21:31 IST|Sakshi

మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

సాక్షి, విశాఖపట్నం: చిరంజీవి స్థాయి దిగజార్చేలా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తన జీవితం, జీవనం ఇచ్చింది చిరంజీవే అన్న సంగతి పవన్‌ గుర్తు పెట్టుకోవాలన్నారు. పవన్‌కు రాజకీయాలపై అవగాహన లేదన్నారు. పవన్‌ పొత్తు ఎవరికి కావాలి. పవన్‌కు ధైర్యముంటే 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తామని చెప్పాలని మంత్రి సవాల్‌ విసిరారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ నాయకులకు సీఎం జగన్‌పై విమర్శలు చేసే అర్హత లేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి కేంద్ర మంత్రి మాట్లాడితే బాగుండేదని మంత్రి అన్నారు.
చదవండి: ‘ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ చదవటం కాదు’.. అనురాగ్‌ ఠాగూర్‌పై నిప్పులు చెరిగిన ఏపీ మంత్రి 


 

మరిన్ని వార్తలు