‘చంద్రబాబు ఎప్పుడు ఏ పార్టీ జెండా మోస్తారో తెలియని పరిస్థితి’

17 Nov, 2022 15:22 IST|Sakshi

సాక్షి, తిరుపతి జిల్లా: పుత్తూరు మండలం పరమేశ్వర మంగళంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ  సందర్భంగా ఆమె కేక్‌ కట్‌ చేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.

అనంతరం ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ, 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రజలకు ఏమీ చేయలేదని మండిపడ్డారు. చంద్రబాబు ఆనాడు ఎన్టీఆర్‌ను కన్నీళ్లు పెట్టించారని, చంద్రబాబు ఎప్పుడు ఏ పార్టీ జెండా మోస్తారో తెలియని పరిస్థితి అని దుయ్యబట్టారు. మేనిఫెస్టో హామీలు నెరవేర్చని బాబు మళ్లీ అవకాశం ఇవ్వమంటున్నారని ఆమె ధ్వజమెత్తారు.
చదవండి: ‘చంద్రబాబును నమ్మరు.. 14 ఏళ్లలో ఏం చేశారో అందరూ చూశారు’

మరిన్ని వార్తలు