పవన్‌ పోరాటం ప్రజల కోసం కాదు.. పొత్తుల కోసం: మంత్రి రోజా

6 Jun, 2022 14:12 IST|Sakshi

సాక్షి, నెల్లూరు జిల్లా: పవన్‌ పోరాటం ప్రజల కోసం కాదు.. పొత్తుల కోసం అని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, 2019లో పవన్‌ను రెండు చోట్ల ప్రజలు ఓడించారు. 2024లో కూడా అదే రిపీట్‌ అవుతుంది. చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతం. టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రోజా అన్నారు. బద్వేలుకి మించిన మెజారిటీ ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీకి వస్తుంది. బద్వేలులో బిజేపీకి వెనుక నుంచి మద్దతు ఇచ్చిన టీడీపీ, జనసేన ప్రయత్నాలు ఫలించలేదని మంత్రి రోజా అన్నారు.
చదవండి: పవన్‌కల్యాణ్‌పై సీపీఎం మధు సీరియస్‌

మరిన్ని వార్తలు