బద్వేలులో బీజేపీకి డిపాజిట్‌ కూడా రాదు: మంత్రి వెల్లంపల్లి

24 Oct, 2021 11:42 IST|Sakshi

సాక్షి, బద్వేలు(వైఎస్సార్‌ కడప): బద్వేలులో బీజేపీకి డిపాజిట్‌ కూడా రాదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. బద్వేలు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ దాసరి సుధా తరపున ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీకి ప్రజలని ఓట్లు అడిగే  అర్హత లేదని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిందని అన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దాసరి సుధని భారీ మెజార్టీతో గెలిపించాని ప్రజలను కోరారు.  

చదవండి: రాష్ట్రపతి పాలన పెట్టాలనడం సరికాదు

మరిన్ని వార్తలు