MLA Balakrishna Reaction on AP New Districts: కొత్త జిల్లాల ప్రకటనపై స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ

28 Jan, 2022 07:12 IST|Sakshi

MLA Nandamuri Balakrishna Reaction on AP New Districts: పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. అయితే సత్యసాయి జిల్లాను హిందూపురం కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు గురువారం బాలకృష్ణ ఓ వీడియో విడుదల చేశారు.

జిల్లా కేంద్రానికి ఉండాల్సిన అన్ని అర్హతలు హిందూపురానికి ఉన్నాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూములు పుష్కలంగా ఉన్నాయని గుర్తు చేశారు. హిందూపురం పట్టణ ప్రజల మనోభావాలను గౌరవించి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు.

చదవండి: (కొత్త జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు.. స్పందించిన పురందేశ్వరి)

మరిన్ని వార్తలు