ప్రలోభపెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య: ఎమ్మెల్యే వంశీ

24 Mar, 2023 12:48 IST|Sakshi

సాక్షి, విజయవాడ: చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో దిట్ట అని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో స్టీఫెన్‌ను కొనుగోలు చేస్తూ పట్టుబడిన సంగతి అందరికీ తెలిసిందే. ఓటుకు కోట్లు కేసులో పట్టుబడి అర్థరాత్రి పారిపోయి వచ్చింది చంద్రబాబు కాదా. ప్రలోభపెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య’’ అంటూ దుయ్యబట్టారు.

‘‘నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి గెలిచాడు. చంద్రబాబుకు మైండ్ గేమ్ ఆడటం అలవాటు. టీడీపీకి ఓటు వేసింది ఎవరనేది అధిష్టానం గుర్తించింది. బాలకృష్ణ సినిమా డైలాగులు రాజకీయంలో పనిచేయవు. సినిమాలో అన్నీ డూపులు అమర్చినట్లు వారి మాటలు కూడా డూపులే. సినిమాకి, రాజకీయానికి చాలా తేడా ఉంటుంది’’ అని ఎమ్మెల్యే వంశీ అన్నారు.
చదవండి: సీఎం జగన్‌ తలుచుకుంటే.. అది పెద్ద కష్టమేమీ కాదు..

whatsapp channel

మరిన్ని వార్తలు