లోకేష్‌ యాత్రలో డబ్బుల గోల.. సోషల్‌ మీడియాలో వైరల్‌

23 Mar, 2023 09:18 IST|Sakshi

సాక్షి, అనంతపురం: నారా లోకేష్‌ యాత్రలో డబ్బుల గొడవ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. లోకేష్ పాదయాత్ర లో పాల్గొన్న ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పంపిణీ చేశారు.

తమకు 500 రూపాయల చొప్పున ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన హిందూపురం టీడీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. తెలుగు తమ్ముళ్ల రభస సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. లోకేష్ పాదయాత్ర కు జన సమీకరణ కోసం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు డబ్బు, మద్యం భారీగా పంపిణీ చేశారు.
చదవండి: ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్‌.. 78.94 లక్షల మందికి రూ.6,419 కోట్లు

మరిన్ని వార్తలు