త్వరలో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

29 Jun, 2021 15:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు  వర్షాకాల సమావేశాలు వచ్చే నెలలో ప్రారంభంకానున్నాయి. జూలై 19 న ప్రారంభమై ఆగస్టు 13 తో ముగియనున్నాయి. దాదాపు నెల రోజుల పాటు ఈ సెషన్‌ జరగనుంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) సిఫారసు చేసింది. ఈ సందర్భంగా  పార్లమెంటు  ఆవరణలో  కోవిడ్‌కు సంబంధించిన అన్ని ప్రోటోకాల్‌లు  పాటిస్తారు. అలాగే  సభ్యులంతా  కనీసం ఒక మోతాదు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని భావిస్తున్నారు. సాధారణంగా పార్లమెంటు  మాన్‌సూన్‌  సెషన్‌ జూలై మూడవ వారంలో ప్రారంభమవుతుంది. ఆగస్టు15 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ముగుస్తుంది.


 

>
మరిన్ని వార్తలు