రాత్రి మందు తాగి.. పగలు ప్రజల్ని కొట్టడం

7 Mar, 2021 04:13 IST|Sakshi

బాలయ్యపై ఎంపీ గోరంట్ల ఆగ్రహం

సాక్షి, అనంతపురం‌: టీడీపీ అభిమానిపై ఎమ్మెల్యే బాలకృష్ణ చేయి చేసుకోవడాన్ని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఖండించారు. శనివారం అనంతపురంలోని 25వ డివిజన్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాస్‌కు మద్దతుగా గోరంట్ల మాధవ్, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ప్రచారం నిర్వహించారు. ఎంపీ మాధవ్‌ మాట్లాడుతూ.. రాత్రి మందు తాగడం.. పగలు ప్రజలను కొట్టడం ఎమ్మెల్యే బాలకృష్ణకు మామూలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి ఓటేసిన పాపానికి అభిమానులు శిక్ష అనుభవించాలా అని ప్రశ్నించారు. 

చదవండి: (మరోసారి అభిమాని చెంప ఛెళ్లుమనిపించిన బాలయ్య)

మరిన్ని వార్తలు