MP Mopidevi Venkata Ramana: మద్యం మరణాలపై టీడీపీ దుష్ప్రచారం

17 Jul, 2022 12:37 IST|Sakshi

సాక్షి, బాపట్ల జిల్లా: మద్యం మరణాలపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. ఆదివారం ఆయన రేపల్లెలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ నేతకు చెందిన వేడుకల్లో మద్యం పంపిణి చేశారని.. ఆ వేడుకల్లో మద్యం తాగి ఇద్దరు మరణిస్తే ప్రభుత్వానికి అంటగడుతున్నారన్నారు. చంద్రబాబు మాదిరిగా ఎమ్మెల్యే సత్యప్రసాద్‌ శవ రాజకీయాలు చేస్తున్నారని మోపిదేవి నిప్పులు చెరిగారు.
చదవండి: కూలుతున్న టీడీపీ కంచుకోట.. కుప్పంలో వైఎస్సార్‌సీపీ రెపరెపలు 


 

మరిన్ని వార్తలు