Munugodu Politics: బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

21 Aug, 2022 18:26 IST|Sakshi

సాక్షి, నల్గొండ జిల్లా: మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో ఆరాచక పాలన అంతమొందించాలని పిలుపునిచ్చారు. ‘‘అమ్ముడుపోయే వ్యక్తిని కాదు నేను. మునుగోడు ప్రజల తలదించుకునే పని ప్రాణం పోయినా చేయను’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో సమానత్వం కోసం యుద్ధం జరుగుతోందన్నారు.

ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. తప్పు చేసిన వారు భయపడతారు. నేను ఏ తప్పూ చేయలేదు. ఎన్నిసార్లు అడిగిన ముఖ్యమంత్రి అపాయిమెంట్‌ ఇవ్వలేదు. ఉప ఎన్నిక అనగానే సీఎం మునుగోడుకు వచ్చారు. నా రాజీనామాతో ప్రభుత్వం దిగి వచ్చింది’’ అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.


మరిన్ని వార్తలు