కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి బీజేపీ నేత అంజయ్య

30 Mar, 2021 19:04 IST|Sakshi

సాగర్‌ ఉపఎన్నిక బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ కడారి అంజయ్య

సాక్షి, హైదరాబాద్‌: సాగర్‌ ఉపఎన్నిక బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ అసంతృప్తి నేత కడారి అంజయ్య ఆ పార్టీకి షాక్‌ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి చేరారు. కాగా చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన అభ్యర్థుల ఖరారు అంశంలో బీజేపీ ఆచితూచి వ్యవహరించి, రవికుమార్‌(ఎస్టీ వర్గం)కు టికెట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో, అంజయ్య మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆయనను సంప్రదించి చర్చలు జరుపగా ఆయన టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్‌లో​ బీజేపీ డిపాజిట్‌ కోల్పోయింది. అప్పుడు ఆ పార్టీ తరఫున బరిలోకి దిగిన నివేదితారెడ్డికి 2,675 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి, ప్రస్తుతం బీజేపీ నుంచి టికెట్‌ ఆశించిన అంజయ్య  27,858 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
సాగర్‌ ఉప ఎన్నిక: బీజేపీకి భారీ షాక్‌
హైదరాబాద్‌: రోడ్డు పైకి వెళ్తున్నారా? తస్మాత్‌ జాగ్రత్త!

మరిన్ని వార్తలు