కాకినాడ మేయర్‌పై అక్టోబర్‌ 5న అవిశ్వాస తీర్మానం

18 Sep, 2021 18:35 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: కాకినాడ మేయర్‌పై అక్టోబర్‌ 5న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. నిన్న కలెక్టర్‌ను కలిసిన 33 మంది కార్పొరేటర్లు.. నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. మేయర్‌ పావనికి కలెక్టర్‌ హరికిరణ్‌ నోటీసులు పంపించారు. నోటీసు తీసుకునేందుకు ఇంట్లో నుంచి మేయర్‌ పావని బయటకు రాకపోవడంతో మేయర్‌ ఇంటి గోడకు అధికారులు నోటీసును అతికించారు.

చదవండి:
అయ్యన్న వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ నిరసన
ఏపీకి పార్లమెంట్‌ కమిటీ ప్రశంసలు

మరిన్ని వార్తలు