ఎమ్మెల్యేగా నోముల భగత్‌ ప్రమాణ స్వీకారం

12 Aug, 2021 11:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో గెలుపొందిన నోముల భగత్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్‌ చాంబర్‌లో స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి భగత్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు  తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే గాదరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

గతేడాది డిసెంబర్‌ ఒకటిన నోముల నర్సింహయ్య మరణించడంతో నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు భగత్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగాగా పోటీ చేసి గెలిచారు.

మరిన్ని వార్తలు