టీడీపీలో మరోసారి భగ్గుమన్న వర్గ విభేదాలు.. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి

16 May, 2023 20:16 IST|Sakshi

సాక్షి, నంద్యాల: జిల్లా టీడీపీలో మరొకసారి విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నేత భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.

లోకేస్‌ పాదయాత్రలో తమ బలాన్ని నిరూపించుకునేందుకు దాడి చేశారని ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఏవీ సుబ్బారెడ్డి పై జరిగిన దాడిని పలువురు నేతలు ఖండిస్తున్నారు.

మరిన్ని వార్తలు