కరోనాతో బీజేపీ ఎంపీ మృతి : మోదీ సంతాపం

2 Mar, 2021 11:08 IST|Sakshi

సాక్షి, భోపాల్‌: కరోనా మహమ్మారి బారిన పడి మరో బీజేపీ ఎంపీ కన్నుమూశారు. మధ్యప్రదేశ్‌ బీజేపీ లోక్‌సభ ఎంపీ నందకుమార్ సింగ్ చౌహాన్ తుదిశ్వాస విడిచారు. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో గత 15 రోజులుగా ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం కన్నుమూశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. పార్టీకి ఆయన లేని లోటు తీరనిది అంటూ ట్వీట్‌ చేశారు. పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. అటు నందకుమార్ మృతిపై బీజేపీ శ్రేణులు, నేతలు విషాదంలో మునిగిపోయారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ,  తమనేత అకాలమరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  కాగా 2009-14మధ్య ఐదేళ్ల  కాలంలో తప్ప 1996 నుండి చౌహాన్ లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు.

చదవండి : ఎన్నికల వేడి: బీజేపీలో చేరిన సినీ నటి

 హత్రాస్‌లో మరో దారుణం : బాధితురాలి తండ్రి హత్య

మరిన్ని వార్తలు