Bhagwant Mann Hyderabad Visit: సీఎం కేసీఆర్‌తో పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ భేటీ..

20 Dec, 2022 18:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ మంగళవారం సమావేశయ్యారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ భేటీలో దేశంలోని ప్రస్తుత రాజకీయాలతోపాటు పంజాబ్‌ రాష్ట్ర పరిస్థితులపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించినట్లు తెలుస్తుంది. కేసీఆర్‌తో భేటీ ముగియడంతో ప్రగతి భవన్‌ నుంచి పంజాబ్‌ సీఎం బయలు దేరారు. కాగా తాజ్‌ కృష్ణలో ఓ ఇన్‌వెస్ట్‌మెంట్‌ మీటింగ్‌లో పాల్గొనడానికి భగవంత్‌ మాన్‌ హైదరాబాద్‌ విచ్చేసిన సంగతి తెలిసిందే.

24న పంజాబ్‌ స్పీకర్‌ రాక
పంజాబ్‌ శాసనసభ స్పీకర్‌ సర్దార్‌ కుల్తార్‌సింగ్‌ సంధ్వాన్‌ ఈ నెల 24న తెలంగాణకు రానున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ స్పీకర్‌ జైకిషన్‌ సింగ్‌ రౌరీ, రాజ్యసభ సభ్యుడు విక్రమ్‌జీత్‌ సింగ్‌ సాహ్ని, ఎమ్మెల్యే కుల్వంత్‌ సింగ్‌ పండోరి, మరో ఇద్దరు కూడా హైదరాబాద్‌కు రానున్నారు.
చదవండి: బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ హాట్‌ కామెంట్స్‌

మరిన్ని వార్తలు