బీజేపీలోకి ‘రాముడు’

19 Mar, 2021 01:38 IST|Sakshi

న్యూఢిల్లీ: రామాయణం సీరియల్‌లో రాముడి పాత్రధారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు అరుణ్‌ గోవిల్‌(63) గురువారం బీజేపీలో చేరారు. బీజేపీ జనరల్‌ సెక్రటరీ దేవశ్రీ చౌదరి సమక్షంలో అరుణ్‌ గోవిల్‌ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జైశ్రీరామ్‌ అనేది రాజకీయ నినాదం కాదన్నారు. భారతీయులకు అదొక జీవన విధానమని చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలను జైశ్రీరామ్‌ నినాదం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు