'కేసీఆర్‌.. మోసం' కవలపిల్లలుగా కనిపిస్తారు: రేవంత్‌ రెడ్డి

22 Aug, 2021 14:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌, మోసం కవలపిల్లలుగా కనిపిస్తారంటూ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ దత్తత గ్రామమైన మూడు చింతలపల్లిలో​ రేవంత్‌ రెడ్డి ఆదివారం ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామానికి కేసీఆర్ ఏం చేశాడో ప్రజలకు చూపిస్తాం. కేసీఆర్ పాలనలో అత్యధికంగా దోపిడీకి గురైంది దళితులే అంటూ చురకలంటించారు.


 

మరిన్ని వార్తలు