తాడేపల్లి: కుప్పం కూడా చంద్రబాబు నాయుడు చేయి దాటిపోయిందనే విషయం ఆయనకి ఇప్పుడు అర్థమైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అధికారం ఇస్తే కుప్పం బ్రాంచ్ కెనాల్ని తవ్విస్తానని చంద్రబాబు అంటున్నాడని, అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని సజ్జల ప్రశ్నించారు.
శుక్రవారం సజ్జల ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు హయాంలో చేసిన గుర్తుండే పని ఒక్కటైనా ఉందా?, వైఎస్ఆర్ హయాంలో కానీ, జగన్ హయాంలో కానీ వందల పథకాలను అమలు చేస్తున్నాం.చంద్రబాబు అనే వ్యక్తి మన కళ్లెదుట కనిపిస్తున్న ఆషాడభూతి. ఎల్లో మీడియా సృష్టించిన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు సోషల్ మీడియా సహకారంతో మరింత విశృంఖులమవుతున్నారు. ఎల్లో మీడియాలో వచ్చే కథనాలతోనే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడు.అంతకుమించి ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు ఏనాడూ చేయడు .
నెల్లూరు జంట హత్యలను కూడా వైసీపి అంటగట్టే ప్రయత్నం చేసింది ఈనాడు.గతంలో వచ్చే బూతు పత్రికల కంటే దారుణంగా తయారయింది ఈనాడు పత్రిక పరిస్థితి.ప్రత్యేక హోదా, పోలవరంపై మాట మార్చింది చంద్రబాబే.వీళ్ల చేతుల్లో పడితే మునగచెట్టు ఎక్కించి ఎత్తి కింద పడేస్తారు. ఎంతోమంది జీవితాలను ఆ మీడియా, చంద్రబాబు పార్టీ నాశనం చేసింది’ అని విమర్శించారు సజ్జల.