సీఎం జగన్ మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నారు: సజ్జల

9 Mar, 2023 14:50 IST|Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సామాజిక న్యాయం జరుగుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా పెనుమత్స సురేష్‌, కోలా గురువులు, ఇజ్రాయిల్‌, మర్రి రాజశేఖర్‌, జయమంగళ వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నం నామినేషన్లు వేశారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు ఇన్ని అవకాశాలు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ‘‘సీఎం జగన్‌ సామాజిక సాధికారతను చేతల్లో చూపుతున్నారు.. మూడున్నరేళ్లలో సీఎం జగన్ సామాజిక విప్లవం తీసుకొచ్చారు’’ అని సజ్జల అన్నారు.

‘‘18 ఎమ్మెల్సీ స్థానాల్లో 14 స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాం. అందులో 11 స్థానాలు బీసీలకు కేటాయించడం చరిత్రాత్మకం. రాజకీయ సాధికారత దిశగా సీఎం జగన్‌ ముందుకు వెళ్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్‌ పెద్దపీట వేస్తున్నారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
చదవండి: నామినేషన్‌ దాఖలు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు

మరిన్ని వార్తలు