టీడీపీ నేత దేవినేని ఉమకు ఘోర పరాభవం

24 Jul, 2021 15:41 IST|Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: వీరులపాడు మండలం జూలూరులో టీడీపీ నేత దేవినేని ఉమకు ఘోర పరాభవం ఎదురైంది. రోడ్ల పరిశీలనకు వచ్చిన దేవినేని ఉమను టీడీపీ కార్యకర్తలు నిలదీశారు. టీడీపీ కార్యకర్తలకు ఏ న్యాయం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దేవినేని ఉమ సహా టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు.

మరిన్ని వార్తలు