Kuppam: డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేతలు

13 Nov, 2021 15:27 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: టీడీపీ నేతలకు కుప్పం టెన్షన్‌ పట్టుకుంది. ఓటమి భయంతో పచ్చ నేతలు కొత్త డ్రామాకు తెరతీశారు. ఇప్పటికే సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కనీసం కుప్పం మున్సిపాలిటీలోనైనా పరువు దక్కించుకోవాలని ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలకు తెరలేపింది. కుప్పంలో ఓటర్లకు భారీగా టీడీపీ నగదు పంపిణీ చేస్తోంది. డబ్బులు తీసుకోండి.. ఓటేయండి అంటూ టీడీపీ ఓపెన్‌ ఆఫర్‌ ఇస్తోంది. వార్డుల వారీగా తిరుగుతూ టీడీపీ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారు. కుప్పంలో చంద్రబాబు పరువు కాపాడేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ నేతలు.. ఓటుకు రూ.4వేలు పంచుతున్నారు.

చదవండి: ‘కుప్పంలో విజయానికి లోకేష్ ఐదు వేలు పంచడం సిగ్గుచేటు’

ఓటర్లకు డబ్బులు పంచుతూ  టీడీపీ నేతలు మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. కుటుంబంలో నలుగురికి మించి ఉంటే, టీవీ, ఫ్రిడ్జ్‌లను కూడా టీడీపీ నేతలు ఆఫర్‌ ఇస్తున్నారు. కుప్పం మునిసిపల్‌ ఎన్నికల్లో ఓటమి భయం వెన్నాడుతుండటంతో టీడీపీ నేతలు అన్ని అడ్డదారులు తొక్కుతున్నారు. ఎలాగైనా కుప్పంలో గెలవాలని చంద్రబాబు, లోకేశ్‌.. తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

కుప్పంలో చంద్రబాబు, లోకేష్‌ అరాచకాలు: ఎంపీ మిథున్‌రెడ్డి
గత రెండు వారాలుగా కుప్పంలో చంద్రబాబు అరాచకాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రలోభాల పర్వానికి కూడా టీడీపీ తెరలేపిందన్నారు. చంద్రబాబు హయాంలో కుప్పం నియోజకవర్గాన్ని ఏవిధంగానూ అభివృద్ధి  చేయలేదన్నారు.
చదవండి: లోకేశ్‌ ప్రచారం.. డబ్బు పంపిణీ.. 


 

మరిన్ని వార్తలు