రైతు సమస్యలపై జిల్లాలకు సంజయ్‌

15 Nov, 2021 05:20 IST|Sakshi

ఉమ్మడి నల్లగొండలో నేడు, రేపు పర్యటన  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ధాన్యం విక్రయాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించేందుకు బీజేపీ రాష్ట్రనాయకులు జిల్లాల్లో పర్యటించనున్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలిస్తారు. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, ఇతర నాయకులు వివిధ జిల్లాల్లో పర్యటించనున్నారు.

నల్లగొండ జిల్లా అర్జాలబావిలోని ఐకేపీ సెంటర్‌ (నల్గొండ రూరల్‌ మండలం)ను బండి సంజయ్‌ సోమవారం సందర్శిస్తారు. ఆ తర్వాత మిర్యాలగూడ, నేరేడుచర్ల, గరిడేపల్లి ప్రాంతాల్లో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకుంటారు. రాత్రి సూర్యాపేటలో సంజయ్‌ బస చేస్తారు. మంగళవారం సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, తుంగతుర్తి, దేవరుప్పల, జనగామ మండలాల్లో పర్యటిస్తారు.  

మరిన్ని వార్తలు