హైదరాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండానే..

22 Nov, 2020 19:52 IST|Sakshi

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

సాక్షి, హైదరాబాద్: బీజేపీ అంటే టీఆర్‌ఎస్‌కు భయం పట్టుకుందని.. అందుకే తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓ ఛానెల్ లోగోతో తనను ప్రచార బాధ్యతల నుండి తప్పించారని అధికార పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ‘‘రాజాసింగ్ పేరుతో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండానే. రాబోయే రోజుల్లో భాగ్యనగరాన్ని పాకిస్తాన్‌గా మార్చాలని దూరాలోచన టీఆర్ఎస్‌లో ఉంది. (చదవండి: ‘ఓట్ల కోసం ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు’)

హైదరాబాద్‌కి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. నగరంలో బీజేపీ మేయర్ అయితే హైదరాబాద్‌ను అహ్మదాబాద్, సూరత్, ఇండోర్ లాంటి నగరాలుగా చేస్తాం. ఎంఐఎం, టీఆర్ఎస్‌లకు ప్రజలు బుద్ధి చెప్పాలి. ఎల్ఆర్ఎస్ పోవాలంటే టీఆర్‌ఎస్‌ పోవాలని’’ బండి సంజయ్‌ పేర్కొన్నారు. (చదవండి: కేటీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే: కిషన్‌రెడ్డి)

మరిన్ని వార్తలు