TS: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆఖరి నిమిషంలో ట్విస్ట్‌

22 Nov, 2021 19:01 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. జిల్లాలో నిన్నటి వరకు కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకులు లలిత పేరు వినిపించింది.
(చదవండి: ఎటూ తేల్చని కాంగ్రెస్‌)

కానీ చివరకు అధిష్టానం నిజామాబాద్‌ నుంచి స్థానికసంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత పేరును ఖరారు చేసింది. రేపు ఉదయం కవిత నామినేషన్‌ వేయనున్నారు. చివరి వరకూ ఆకుల లలిత పేరు వినిపించినా చివరి నిముషంలో కవిత అభ్యర్థిత్వం ఖరారు కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

చదవండి: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఖరారు.. సగం కొత్తవారికే..!

మరిన్ని వార్తలు