వైఎస్ షర్మిల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తన ప్రజావ్యతిరేక విధానాలతో విద్యావ్యవస్థను దిగజారుస్తున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన విశ్వవిద్యాలయాలను సైతం పట్టించుకోవడం లేదంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్.. ఏడేళ్ల పాలనలో కనీసం వర్సిటీలకు పాలక మండళ్లను నియమించలేకపోయారన్నారు.
లెక్చరర్ల పోస్టులు కూడా పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నా పట్టించుకోకపోవడం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితిలో వర్సిటీల విద్యా ప్రమాణాల ర్యాంకులు దిగజారిపోతున్నాయని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.