సాక్షి, హైదరాబాద్: వరదల్లో రాష్ట్రం విలవిలలాడుతుంటే ప్రజలను ఆదుకోవాల్సిన సీఎం కేసీఆర్ ఎక్కడున్నారంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు సీఎం కనీసం ఏరియల్ సర్వే కూడా నిర్వహించలేదని ధ్వజమెత్తారు.
ఆయనకు ముందస్తు ఎన్నికలపై ఉన్న సోయి వరద బాధితులను ఆదుకోవడంలో లేదని దుయ్యబట్టారు. కేసీఆర్కు వేల కోట్ల కమీషన్లు తెచ్చి పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్హౌస్లు వరదలకు నీట మునిగాయని, వాటిని బయటకు తీయడానికి మరో రూ.లక్ష కోట్ల అప్పులు తెచ్చేందుకు సిద్ధంగా ఉండాలని కేసీఆర్పై ఆమె సెటైర్ వేశారు.