కాంగ్రెస్‌లో కల్లోలం: వీహెచ్‌ వ్యవహారంపై రేవంత్‌రెడ్డి సీరియస్‌

2 Jul, 2022 18:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌లో గందరగోళం నెలకొంది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాను కాంగ్రెస్‌ నేతలు కలవలేదు. కానీ టీపీసీసీ ఆదేశాలను పక్కనపెట్టి సిన్హాను వీహెచ్‌ కలిశారు. ఆయన వ్యవహారంపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ: మంత్రి తలసాని

సిన్హాను కలవబోమని ముందే టీపీసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీని నిర్ణయాన్ని ఎవ్వరైనా పాటించాల్సిందేనని.. పార్టీ నిర్ణయం కాదని వ్యక్తిగతంగా మాట్లాడితే గోడకేసి కొడతామని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆ ఇంటిపై వాలిన కాకిని మా ఇంటిపై వాలనీయం’’ అంటూ ధ్వజమెత్తారు. మన ఇంటికి వచ్చినప్పుడే మనం కలవాలని రేవంత్‌రెడ్డి అన్నారు.
 

మరిన్ని వార్తలు