‘దళిత బంధు’ అంతటా అమలుచేయాలి: రేవంత్‌ రెడ్డి

31 Jul, 2021 22:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్ గిరిజనులను అనాథలుగా చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్వించారు. భూములపై హక్కులు లేకుండా చేస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డారు. హుజురాబాద్‌ నియోజకవర్గానికే పరిమితం చేయకుండా రాష్ట్రమంతా దళిత బంధు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ఏకవాక్య తీర్మానం చేయాలని సవాల్‌ విసిరారు. హైదరాబాద్‌లో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

మరిన్ని వార్తలు