‘ఫోన్‌లు ట్యాప్ చేస్తుంది సరిపోవడం లేదా?’ ఇంటలిజెన్స్‌ అధికారులపై కిషన్‌ రెడ్డి ఫైర్‌

2 Oct, 2022 13:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: బిజేపీ రాష్ట్ర కార్యాలయంలో వచ్చిన ఇంటలిజెన్స్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. బిజేపీ కార్యాలయంలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. ‘ఫోన్ లు ట్యాప్ చేస్తున్నది సరిపోవడం లేదా ? కార్యాలయంలోపలికి వస్తే బాగోదు. ప్రగతి భవన్, తెలంగాణ భవన్‌లో ఐబీ వాళ్ళను పెడతా.. ఒప్పుకుంటారా ?  అక్కడ ఒప్పుకుంటే.. ఇక్కడ రాష్ట్ర ఇంటలిజెన్స్ వారికి పార్టీ కార్యాలయంలో ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేయిస్తా’ అని తీవ్రంగా మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

ఇదీ చదవండి: అబద్ధాలపై క్షమాపణ కోరే ధైర్యం కూడా లేదు.. కిషన్‌రెడ్డిపై కేటీఆర్‌ ఆగ్రహం

మరిన్ని వార్తలు