తనపై వచ్చిన ఆరోపణలకు ఉత్తమ్ కౌంటర్
సాక్షి, ఢిల్లీ: తనపై వచ్చిన ఆరోపణలకు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ కేవలం తన ఇమేజ్ పెంచుకునేందుకే సభలు పెట్టారని మండిపడ్డారు. హంగామా చేస్తే సరిపోదని, గెలుపు కోసం అమలు చేయాల్సిన వ్యూహాలు అమలు చేయలేదన్నారు.
కౌశిక్ రెడ్డి పార్టీలో ఉన్నప్పుడే నిర్వహించిన అంతర్గత సర్వేలో కాంగ్రెస్ పరిస్థితి 4 శాతం మించలేదు. కౌశిక్ రెడ్డి జులైలో పార్టీని వీడి వెళ్తే, ఆ తర్వాత కొన్ని నెలల పాటు ప్రస్తుత నాయకత్వం మరో బలమైన అభ్యర్థిని ఎంపిక చేయకుండా ఏం చేసిందని ఉత్తమ్ ప్రశ్నించారు.
కౌశిక్ వ్యవహారాన్ని సాకుగా చూపుతూ తనను కుట్రపూరితంగానే కార్నర్ చేస్తున్నారని ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డికి, పొన్నం ప్రభాకర్కు అస్సలు పడదని, అతను పార్టీని వీడి వెళ్లడానికి సగం కారణం పొన్నమేనని ఉత్తమ్ అన్నారు. రేవంత్ రెడ్డి.. మాణిక్కం ఠాగూర్తో కలిసి పొన్నం ప్రభాకర్కు ఏఐసీసీ కార్యదర్శి పదవి ఆశజూపుతూ తనపై రెచ్చగొట్టి ఆరోపణలు చేయిస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు.