చంద్రబాబూ.. నువ్వో చచ్చిన విషసర్పం

26 Feb, 2021 12:04 IST|Sakshi

సాక్షి, అమరావతి :  ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  శుక్రవారం ట్విటర్‌ వేదికగా..‘‘ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి నేనెవరికీ భయపడను, నన్నెవరూ భయపెట్టలేరంటూ గింజుకుంటున్నాడు. చంద్రబాబూ...నువ్వో చచ్చిన విషసర్పానివి. నిన్నెవరూ భయపెట్టడం లేదు. అరుదైన మానసిక వ్యాధితో బాధపడుతున్నావు. ఎన్నికల్లో చిత్తుగా ఓడించాక అది మరింత ముదిరింది.’’ అని పేర్కొన్నారు.

వైఎస్సార్‌ సీపీలోకి భారీగా చేరికలు 
విశాఖపట్నం : ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో పలువురు టీడీపీ నేతలు శుక్రవారం పార్టీలో చేరారు.  14, 15, 25 వార్డుల నుంచి 500 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ సీఎం వైఎస్‌ జగన్ సంక్షేమ కార్యక్రమాలు చూసి టీడీపీ నేతలు పార్టీలోకి వస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయి. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధిస్తాం. విశాఖ అభివృద్ధికి వైఎస్సార్‌ సీపీ కట్టుబడి ఉంది.’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు