డ్రామాలు రక్తి కట్టించావ్.. షేమ్.. షేమ్.. బాబూ..!

11 Aug, 2020 08:47 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. 'సగం  కొట్టుకుపోయిన కాఫర్ డ్యాం కట్టి పోలవరం పూర్తిచేసినట్లు బిల్డప్ ఇచ్చాడు జూమ్ బాబు. నీ ఐదేళ్లపాలన కమీషన్లకోసం కాంట్రాక్టర్లను మార్చడానికే సరిపోయింది బాబు. పోలవరం అసలు డ్యామ్ పునాదులు కూడా తమరు వేయలేదు. ప్రచారం కోసం స్పిల్‌ వేపై ర్యాంప్ వాక్ అంటూ డ్రామాలు రక్తి కట్టించావ్' అంటూ దుయ్యబట్టారు. (రమేశ్‌ ఆస్పత్రి ఘటనపై ఎందుకు మాట్లాడవు బాబూ?)

కాగా మరో ట్వీట్‌లో.. 'బట్టలు విడిచిన మూర్ఖపు రాజు.. తాను వేసుకున్న దేవతా వస్త్రాలు మూర్ఖులకు కనిపించటం లేదనుకున్నాడట! 175కు 151 ఓడిన, కొడుకును కూడా ఓడగొట్టుకున్న చంద్రబాబు... 13 జిల్లాల్ని తాను అభివృద్ధి చేశానని ఏవేవో గ్రాఫిక్స్ ఇప్పుడు చూపిస్తున్నాడట!! షేమ్.. షేమ్.. బాబూ...!' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
(మైనార్టీలకు సీఎం జగన్‌ పెద్దపీట)

>
మరిన్ని వార్తలు