'ఇలాంటిదెప్పుడైనా ఊహించారా.. దటీజ్‌ సీఎం జగన్‌'

20 Nov, 2020 11:51 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. 'పిల్లలు రావట్లేదని అప్పట్లో వందల స్కూళ్లను మూసేయించారు బాబు. మౌలిక వసతులు కల్పించకుండా గాలికొదిలేసి కార్పొరేట్‌ విద్యాసంస్థల విస్తరణకు చప్పట్లు కొట్టారు. 2.5 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడుల్లో చేరారు. ఇలాంటిదెప్పుడైనా ఊహించారా. దటీజ్‌ సీఎం జగన్‌' అంటూ ట్వీట్‌ చేశారు.   (చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూత)

>
మరిన్ని వార్తలు