సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘అమరావతి కోసం రోడ్లెక్కండి అంటూ హైదరాబాద్ ఇంటిపట్టున ఉండి చెప్తున్నాడు జూమ్ బాబు. కరోనాకు భయపడి తన ఇంటికి పార్టీ సీనియర్ నాయకులను కూడా రానివ్వడం లేదు. నాయకుడంటే ముందుండి నడపాలి బాబు. ఇంట్లో కూర్చొని జూమ్ ద్వారా కాదు’ అంటూ ఎద్దేవా చేశారు. (ఎంతటి వారైనా వదిలేది లేదు)