'పచ్చ'దనం ఇంకా పోలేదు.. ఉబలాటపడుతోంది..

30 Apr, 2021 18:23 IST|Sakshi

సాక్షి, అమరావతి: పచ్చ మీడియాపై ట్విటర్‌ వేదికగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'చంద్రబాబు పచ్చ మాఫియా అన్ని రంగాల్లో వేళ్లూనుకుంది. రెండేళ్లే అయింది కదా ఇంకా పచ్చ’దనం పోలేదు. ఏదో ఒక రూపంలో స్వామి భక్తిని ప్రదర్శించాలని ఉబలాటపడుతోంది. ప్రజలు అఖండ మెజారిటీతో విజయ హారతులు పట్టిన జగన్ గారున్నారిక్కడ. మాఫియా మూర్ఖపు పోకడలు మానుకోవాలి' అని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు