కవి రానాపై రెచ్చిపోయిన యూపీ మంత్రి

21 Jul, 2021 17:53 IST|Sakshi
ఆనంద్ స్వరూప్ శుక్లా (ఫైల్‌ ఫోటో)

వాళ్లను ఎన్‌కౌంటర్‌  చేయాలి: యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

భారతీయులను వ్యతిరేకించిన వారిని ఎన్‌కౌంటర్‌ చేయాలి

ప్రముఖ ఉర్దూ కవి మున్నావర్  రానాకు మంత్రి కౌంటర్‌

సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. భారతీయులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని ఎన్‌కౌంటర్‌లో  హత్య చేయాలని వ్యాఖ్యానించారు. ప్రముఖ ఉర్దూ కవి మున్నావర్  రానాను ఉద్దేశించి ఆయన  ఈ  వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

 రానున్న ఎన్నికల్లో యోగీ ఆదిత్యనాథ్ మళ్లీ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే తాను రాష్ట్రాన్ని విడిచిపెడతానని ఇటీవల కవి రానా ప్రకటించారు. దీనికి  కౌంటర్‌ ఇచ్చిన యూపీ ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1947 విభజన తరువాత కూడా దేశంలో ఉంటూ, దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగమవుతున్న వారిలో రానా ఒకరని శుక్లా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశీయులకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని ఎన్‌కౌంటర్‌ చేయాలన్నారు. కాగా యూపీ ఎన్నికల్లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రవేశాన్ని రానా వ్యతిరేకించారు. ఇలాంటి నేతలు ముస్లింల మధ్య చీలికలు తెచ్చి వారిని నాశనం చేస్తున్నారని  విమర్శించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు